Nadigoti Naresh: మాన్యశ్రీ కాన్సిరాంకి భారతరత్న అవార్డు ఇవ్వాలి

సిరా న్యూస్, భీమదేవరపల్లి
మాన్యశ్రీ కాన్సిరాంకి భారతరత్న అవార్డు ఇవ్వాలి
* బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నడిగోటి నరేష్
* ఘ‌నంగా మాన్యశ్రీ కాన్సిరాం జ‌యంతి వేడ‌క‌లు
బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు బహుజనులకు రాజ్యాధికారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన దాదాసాహెబ్ మాన్యశ్రీ కాన్సిరాం 90వ జయంతి శ‌నివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు పులి నిరజ, హుస్నాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం చేప‌ట్టారు. అనంత‌రం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నడిగోటి నరేష్ మాట్లాడుతూ మాన్యశ్రీ కాన్సిరాంకి భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు తూముల స్వామి, వడ్లూరి కుమార్, మాజీ మండల అధ్యక్షులు తాడూరు చిరంజీవి గడిపే బిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి గడిపే సందీప్, తెలంగాణ అంబేద్కర్ సంఘం కన్వీనర్ ఎల్తూరి ప్రేమ్ రాజ్, కో కన్వీనర్ కొమ్ముల రవీందర్, నద్దునురి విజయ్, మిడిదొడ్డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *