సిరాన్యూస్, బోథ్
నాగభూషణం పాఠశాల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
బోథ్ మండల కేంద్రంలో శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది తెలుగు నూతన సంవత్సరం సందర్బంగా నాగభూషణం పాఠశాల ఆధ్వర్యంలో బోథ్ బస్టాండ్ ప్రాంతంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ హాజరయ్యారు. విద్యార్థులకు ఉగాది ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కిషోర్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.