శ్రీవారిని దర్శించుకున్న నగరి టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నగరి టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నగరి టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా ఏకమై రాష్టాన్ని కాపాడుకోడానికి టీడీపీకి పట్టంగట్టారన్నారు. ప్రజలు మాపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్రాని చంద్రబాబు నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం 12వ తేదీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉండటంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *