నాగార్జున సాగర్ అప్డేట్

సిరా న్యూస్,నల్గోండ;
ఎగువున శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి జలకళను సంతరించుకోవడoతో మూడు గేట్లు పైకి ఎత్తి 79 వేల 956 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఈ క్రమంలో సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను.. ప్రస్తుతం 515 అడుగులకు చేరింది. ఇక.. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీ లకు గానూ.. ప్రజెంట్ 140 టిఎంసి గా ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాగునీటి అవసరాల కోసం 5 వేల 944 క్యూసెక్కులను విడుదల చేస్తుoడగా.. అలాగే.. హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి అవసరాల కోసం ఏఎంఆర్పీ ప్రాజెక్టుకు 800 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *