Nagaveli Ishwar: విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

సిరాన్యూస్‌,ఓదెల
విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
* ఓదెల మండల విశ్వబ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు నాగవెల్లి ఈశ్వర్
విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల‌ని ఓదెల మండల విశ్వబ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు నాగవెల్లి ఈశ్వర్ అన్నారు. కులవృత్తిపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణులు పల్లెల్లో కులవృత్తి లేక నాన అవస్థలకు గురవుతున్నారన్నారు. వడ్రంగి, స్వర్ణకారులు, కమ్మరి వారు, ఇత్తడి పనిచేసేవారు. శిల్పాలు చెక్కేవారని తెలిపారు. వీరిని పంచదాయిలు అని అంటారని తెలిపారు. ఒకప్పుడు కులవృత్తి చేసుకొని కుటుంబాన్నిపోషించుకునేవారన్నారు. మార్కెట్లోకి కార్పొరేట్ సంస్థల ద్వారా రెడీమేడ్ వస్తువుల ద్వారా కులవృత్తి చేసుకునే వారికి ఉపాధి లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వబ్రాహ్మణులు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అడుగుజాడల్లో కెసిఆర్ ఉద్యమాన్ని నడిపించినారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై తొలి అమరుడు శ్రీకాంత్ చారి ఆత్మహుతి చేసుకున్న అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేస్తామని నమ్మబలికినారని తెలిపారు. కానీ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి సహాయసహా కారాలు అందలేదు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులవృత్తిపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు నిండిన ప్రతి విశ్వబ్రాహ్మణునికి పెన్షన్ మంజూరు చేసి కులవృత్తిపై ఆధారపడిన వారిని ఆదుకావాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *