సిరాన్యూస్,ఓదెల
తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు: విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవెల్లి ఈశ్వర్
విశ్వబ్రాహ్మణుల కోసం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎంతో కృషి చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ఓదెల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవెల్లి ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలిలో వడ్రంగి కమ్మరి పని చేసుకునే షాపులకు 100 శాతం ఉచిత విద్యుత్తు ఇవ్వాలని పిటిషన్ సమర్పించారని తెలిపారు.ఈసందర్భంగా ఓదెల మండల విశ్వబ్రాహ్మణులు తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు తెలిపారు.