సిరాన్యూస్, ఆదిలాబాద్
చంద్రబాబును కలిసిన ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పార్లమెంట్ సభ్యులు నగేష్ , ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఢిల్లీలో ఒక కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు నాయుడుకి ఎంపీ, ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వీరి వెంట బీజేపీ నాయకులు ముస్తాపూరే అశోక్ తదితరులు ఉన్నారు.