పత్రాలు లేని 92ద్విచక్ర వాహనాలు, ఆటో లు స్వాధీనం
సిరా న్యూస్,కడప;
రాబోవు సార్వత్రిక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కడప జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ గారి ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది మరియు కేంద్ర బలగాల తోటి ఈరోజు ఉదయాన్నే ఈశ్వర్ రెడ్డి నగర్ లో నాకాబంధీ నిర్వహించారు. ప్రతి ఇంటిని చెక్ చేసి అదే విధంగా డాక్యుమెంట్స్ లేని మోటర్ సైకిల్స్, ఆటోలను సుమారు 92 వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా కొత్త వ్యక్తులు ఉన్నారేమో అని, మారణాయుధాలు ఉన్నాయేమో అని చెక్ చేసారు.
ఈ సందర్భంగా పొద్దుటూరు డిఎస్పి మాట్లాడుతూ ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఎలక్షన్ లలో గొడవలు పెట్టుకొని శాంతి భద్రతలకు భంగం వాటిలిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నాకా బంధీ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ సిఐ యుగంధర్ గారు, ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ గారు ,టూ టౌన్ సిఐ అబ్దుల్ కరీం గారు, త్రీ టౌన్ సీఐ వెంకటరమణ గారు ,రూరల్ సీఐ రమణారెడ్డి గారు మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
=======================