సిరా న్యూస్,ఖమ్మం;
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు దంపతులు ఓటు వినియోగించుకున్నారు. ఎన్ ఎస్ టి రోడ్ లోని కవితా కవిత డిగ్రీ, పీజీ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ త్వరగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
నామామాట్లాడుతూ మీ అందరి వాడిగా మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలి. మళ్ళీ ఒక ఆలోచనతో ఈ రైతు బిడ్డకు అవకాశం ఇవ్వండి. కొన్ని సున్నిత ప్రాంతాలకు ఎక్కువ మంది సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పంపించాలని కలెక్టర్ ను కోరా. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ ను కోరా. ఓటర్లను అందరినీ ఓట్ వెపించేలా అధికారులు చూడాలి. ఇప్పటికే నన్ను రెండు సార్లు ఆశీర్వదించారు, మూడవసారి కూడ ఆశీర్వదించండని అన్నారు.