సిరాన్యూస్, నాంపల్లి
నాంపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రేవల్లి గ్రామం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులు బుధవారం కాంగ్రెస్ నాయకుడు బట్టు జగన్ యాదవ్ పంపిణీ చేశారు. వంగూరి యదయా రూ.60,000 , ఏటేలి అంజనెలు రూ.27,500, రేవలి లక్ష్మీమ్మ రూ.23 వేలు చొప్పున చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బట్టు జగన్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం ఆందిస్తున్న సీఎం సహాయ నిధి పేదలకు వరంలాంటిదని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.