సిరా న్యూస్,బనగానపల్లె;
బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వ రిదేవి రాయబారాది బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ముందుగా గణపతి, పుణ్యాహ వాచన, అంకురార్పణ పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో ప్రదర్శనగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే రైతులు తమ ఎడ్ల బండిపై అమ్మవారి నైవేద్యం పెట్టుకుని ఆలయం చుట్టూ పన్నేరు బండ్లు తిప్పి ప్రాకార రథో త్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు.
====