టీడీపీ కార్యకర్త హనుమంతు కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

సిరా న్యూస్,కర్నూలు;
ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం, మాచపురం గ్రామంలో హనుమంతు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. హనుమంతు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 24-10-2023న హనుమంతు గుండెపోటుతో చనిపోయాడు. బాధిత కుటుంబానికి భువనేశ్వరి రూ.3లక్షలు చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *