శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్ కుటుంబం

 సిరా న్యూస్,తిరుమల;
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని నారాలోకేష్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి నారాలోకేష్ దంపతులు, నారా భువనేశ్వరి వెళ్లారు. లోకేష్ వెంట శ్రీవారి దర్శనానికి టిడిపి నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్ అమర్నాథ్ రెడ్డి, కంచెర్ల శ్రీకాంత్ ,అనగాని సత్యప్రసాద్ ,పంచమూర్తి అనురాధ, ఆరణి శ్రీనివాసులు, తదితరులు వెళ్లారు.
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక్కరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ 38 లక్షలు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు నారా లోకేష్ విరాళమిచ్చారు. రంగనాయకుల మండపంలో పండితులు నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, దేవాన్ష్ లకు వేదాశీర్వచనం చేసారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *