సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు రోజులపాటు నిత్య కళ్యాణాలు నిత్య హోమాలు శాశ్వత కళ్యాణాలను రద్దు చేస్తున్నారు అధికారులు. ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము లో కూడా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఉదయం సాయంకాలం స్వామివారి అలంకరణ సేవలు ఉంటాయి. జయంతి 21వ తేదీన శ్రీ స్వామివారికి సహస్ర కలసాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది
===============