సిరా న్యూస్, చిగురుమామిడి
దరఖాస్తులను పరిష్కరిస్తాం
* తహసీల్దార్ ఇప్ప నరేందర్
* కొనసాగుతున్న ధరణి స్పెషల్ డ్రైవ్
మండల వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామని తహసీల్దార్ ఇప్ప నరేందర్ తెలిపారు. వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ధరణి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఈ నెల 17 తారీకు వరకు మరో వారం రోజులు ప్రభుత్వం పొడగించింది. ఇందులో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయానికి ధరణి పెండింగ్ దరఖాస్తుదారులు తరలివచ్చారు. కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు.వారం రోజుల గడువు పొడిగించడంతో
మండల వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామని తహసీల్దార్ ఇప్ప నరేందర్ తెలిపారు.