సిరా న్యూస్, కాగజ్ నగర్
సిర్పూర్ కాగజ్ నగర్ 3వ రైల్వే లైన్ ప్రారంభం
* హాజరైన జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ రావు
కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో మంగళవారం వర్చువల్ మోడ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 85 వేల కోట్ల రూపాయల రైల్వే పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుండి ప్రత్యక్ష ప్రసారం చెయ్యడం జరిగింది.అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం, ఇతర రైల్వే పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు.