Narsa Reddy: పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సా రెడ్డికి ఘన నివాళి…

సిరా న్యూస్, హైదరాబాద్:

పీసీసీ మాజీ అధ్యక్షునికి ఘన నివాళి…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సా రెడ్డికి ఆ పార్టీ నాయకులు ఘనంగా నివాలులర్పించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన నర్సా రెడ్డి సంతాప సభలో పార్టీ సీనియర్ నాయకులు హనుమంత రావు, జానా రెడ్డి, మహేష్ గౌడ్, శ్రీహరి రావు, బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు నర్సారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… నర్సా రెడ్డి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయన హయాంలో మంత్రిగా ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లా నిర్మల్ ప్రాంతానికి చెందిన నర్సారెడ్డి ని ప్రజలు ఆప్యాయంగా నర్సాబాపు గా పిలిచేవారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *