నర్సన్నపేట.. టఫ్ ఫైట్…

సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో ఐదోసారి విజయం కోసం ధర్మాన కృష్ణ దాస్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బగ్గు రమణమూర్తిపై కృష్ణదాస్ 19వేల ఓట్లతో గెలిచారు. 2014లో టీడీపీ తరపున గెలుపొందిన రమణ మూర్తి 2019లో ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున ధర్మాన, టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి పోటీ చేస్తున్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
నరసన్న పేటకు జగన్ హామీలు:
నరసన్నపేట టౌన్ పరిధిలో ఆర్అండ్ బీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ కు రూ.10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మధ్యలోనే నిలిచిపోయిన విస్తరణ పనులకు మరో రూ.10కోట్లు అవసరమని ఆర్అం డ్ బీ శాఖ అధికారులు ప్రతిపాదించారు. సీఎం నిధులు ప్రకటించినా ఇంతవరకు రూపాయి మంజూరు కాలేదు.
మడపాం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.15 కోట్ల సాయం ప్రకటించారు. 1,653 ఎకరాలకు సాగునీటి వసతి అందించేందుకు మడపాం వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు గతంలో ప్రతిపాదించారు. ఇందుకు రూ.15 కోట్లు అవసరం. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మార్పుతో అవి రద్దయ్యాయి.
నరసన్నపేట రాజుల చెరువు అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలు మంజూరు చేసి పనులు చేపట్టారు. వైసీపీ హయంలో జగన్ రూ.10కోట్ల నిధులు ప్రకటించి ఏడాది దాటినా ఎలాంటి మార్పు లేదు.
గుడిపేట, కిరికి వద్ద రివర్స్ ఫ్లో ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్లు ఏర్పాటు బీ డీఎల్ పురం వద్ద లోలెవల్ కాజ్వే మంజూరుకు హామీ ఇచ్చారు. అవి నెరవేరలేదు.
బొంతు ఎత్తిపోతల పథకం మిగులు పనుల పూర్తికి రూ.40 కోట్లు ప్రకటించినా విడుదల కాలేదు.
జగన్నాథపురంతో పాటు పలు ప్రాంతాలకు తాగునీటి వసతులు కల్పిస్తామని ప్రకటించారు. నరసన్నపేటలోని జగన్నాథపురంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో అక్కడి ప్రజ లకు తాగునీటికి ఇబ్బందిలేకుండా చూస్తామని చెప్పినా ఇక్కడ తాగునీటి పథకం ఇంకా నిర్మాణదశలో ఉంది.
సారవకోట మండలంలోని రంగసాగరం ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. సారవకోట మండలం బొంతు ఎత్తిపోతల పథకం పెద్ద ప్రాజెక్టు. ఇది పూర్తయితే ఆ మండలమే కాక, చుట్టుపక్కల మండలాలకు సాగునీరందుతుంది. పథకం నిర్మాణ పనులు ఇప్పటికి 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
నరసన్నపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. వంశధార కాలువల ఆధునికీకరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. తంపర భూముల అభివృద్ధి ఆగిపోయింది. జలుమూరు మండలం లింగాలపాడు ఎత్తిపోతల పథకం అభివృద్ధి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించలేదు.
ఎమ్మెల్యేపై ప్రధాన ఆరోపణలు…
ధర్మాన కృష్ణదాస్ కుటుంబంపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రెండున్నరేళ్ల కాలంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎవరూ అవినీతికి పాల్పడవ ద్దంటూ చెబుతూనే ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అవినీతిలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *