సిరా న్యూస్, జైనథ్:
మేడిగూడలో రైతు దినోత్సవం..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మేడిగూడ–ఆర్ గ్రామంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఏజెన్సీస్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు రైతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ క్యాతం శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు దేశానికి వెన్నముఖ అని అన్నారు. రైతులేని రాజ్యం ఊహించలేమని, రైతులను ఇలా సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.