జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య -నేడు ఆయన జయంతి

సిరా న్యూస్;
జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య ఆగస్ట్‌ 02, 1878లో కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో ఆయన జన్మించారు. బొంబాయిలో సైనిక శిక్షణ పొంది ఆఫ్రికా వెళ్లారు. బోయరు యుద్ధంలో పాల్గొ ని తిరిగి వస్తూ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్‌ పర్యటించారు. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యా పకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూ గర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుండి 1944 వరకు నెల్లూరులో ఉండి మైకా గురించి పరిశోధనలు చేశారు.
బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశమునకు ఒక జాతీయ పతాకం’ అనే గ్రంథాన్ని ర చించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు. 1921లో బెజవాడ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ ఆదేశానుసారం త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. గాంధీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్తానంలో అశోకచక్రం చేర్చబడింది. ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్య ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *