ప్రారంభించిన పటాన్చెరు డి.ఎస్.పి పురుషోత్తం రెడ్డి
సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పటాన్చెరు డి.ఎస్.పి పురుషోత్తం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత, జీవనరక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి అమూల్యమైన జీవితాలను కోల్పోవాల్సి వస్తున్నదని అన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపొద్దని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంవిఐ రాజ్ మహమ్మద్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ రెడ్డి, ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఆటో డ్రైవర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.