సిరా న్యూస్,అన్నమయ్య;
సంబేపల్లి మండలం ముదినేనివాండ్లపల్లె వద్ద నాటు తుపాకీ కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమలకు చెందిన రాజగోపాల్ నాటు తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రాజగోపాల్ మృతి చెందాడు. మృతుడు ఇటుకల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అప్పుల బాధే కారణమని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలోనే నాటు తుపాకీ దొరికింది. సంఘటనా స్థలాన్ని రాయచోటి రూరల్ సీఐ తులసీరామ్ పరిశీలించారు. .