Naveen Poth Raj:బీజేపీతోనే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం

సీరా న్యూస్, బేల‌
బీజేపీతోనే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం
*బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ పోత్ రాజ్
బీజేపీతోనే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుంద‌ని బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ పోత్ రాజ్ అన్నారు.బేలా మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో రూ.10 లక్షల ఉపాధి నిధులతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు నాయకులతో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. భాజపాతో గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు సుమారు రూ.17 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు.గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పార్టీతోనే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.కాలనీ వాసులు తరఫున ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గణేష్ బోనిగిరివార్,సంజయ్,రాము బర్కడే,శివా కుమార్,కృష్ణ,గ్రామ పెద్దలు ఉషా రెడ్డి,అమ్రేష్,మహేష్,మడవార్ హరీష్ రెడ్డి,మనోజ్ రెడ్డి, జీవన్,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *