జేడియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నల్లపనేని సంభశివ రావు
సిరా న్యూస్,గుంటూరు;
ఎన్ డిఎ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని యునైటెడ్ జనతదాల్ (జేడియు) ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నల్లపనేని సాంబశివ రావు, జేడియు శ్రీకాకుళం జిల్లా అద్యక్షులు బూరగపు రాజేశ్వర్ రావు నేడొక సంయుక్త ప్రకటనలో అభినందనలు తెలిపారు.కేంద్రంలో తిరిగి ఎన్డియే కూటమి గెలుపొంది ముచ్చటగా మూడవసారి తిరిగి ప్రదానిగా నరేంద్ర మోడీ నేతృత్వం లో ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపద్యం లో ఎన్ డి ఎ కూటమి తరుపున గెలుపొందిన అభ్యర్తులకు వారు శుబాకాంక్షలు తెలిపారు.ఎన్ డిఎ కూటమి బాగస్వామి అయిన జేడియు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్రను పోషించడం, పట్ల తమ పార్టీ అధినేత నితీష్ కుమార్ కు వారు ప్రత్యెక అభినందనలు తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోడీ నేతృత్వం లో భారత దేశం మరింతముందుకు వెల్లగలదని,ప్రపంచంలో అగ్రగామిగా నిలబదగలదన్న ఆశాబానాన్ని వారు వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం లో ఈ సారి తప్పని సరిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యెక హోదా లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. తమ పార్టీ నేతృత్వం లో త్వరలో ప్రతినిధుల బృందం దిల్లికి వెళ్లి నితీష్ కుమార్ ను కలిసి అభినందనలు తెలుపడం తో పాటు ఏపి కి ప్రత్యెక హోదా ఇవ్వడం కోసం మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు సాంబశివ రావు తెలిపారు.
============