Neduru Raja Komuraiya: నేత్రదాత నెదురు రాజ కొమురయ్య సంస్మరణ సభ

సిరాన్యూస్‌,ఓదెల
నేత్రదాత నెదురు రాజ కొమురయ్య సంస్మరణ సభ

నేత్రదాత నెదురు రాజ కొమురయ్య సంస్మరణ సభను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక లోని వారి స్వగృహంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి నేత ఆధ్వర్యంలో నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కరుణాకర్ రెడ్డి , క్యాతం మల్లేశం హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్బంగా వచ్చిన బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు. అలాగే ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భార్య దేవేంద్ర, కుమారులు కోడండ్లు -భరత్- శైలజ అనిల్ -కావేరి కు జ్నాపికను అంద‌జేశారు. సహకరించిన వారు ఆవాల ప్రసాద్ శ్రీధర్- శ్రీనివాస్ సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు క్యాతం మల్లేశం ,మేరుగు సారంగం.బైరి.వినోద్ నవీన్. అభినందనలు తెలిపారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, బీమనపల్లి పృథ్విరాజ్,నరహరి,లగిశెట్టి చంద్రమౌళి, అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *