సిరా న్యూస్, భీమదేవరపల్లి
మల్లారంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ : బీఎల్ఓ నీలం కుమార్
రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ బి ఎల్ వో నీలం కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో బుధవారం ఇంటింటికి తిరుగుతూ ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.