మత్తు కథాచిత్రమ్ లో కొత్త కోణాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. డైరెక్టర్‌ క్రిష్‌ డ్రగ్స్‌ పార్టీలో ఉన్నట్టు తేల్చారు పోలీసులు. తీగ లాగితే కొకైన్‌ డొంక కదులుతోంది. హైదరాబాద్‌ మత్తు కథా చిత్రమ్‌లో కొత్త కోణాలు కలవరం రేపుతున్నాయి. కలకలం పుట్టిస్తున్నాయి. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటిదాకా 10మంది పేర్లు చేర్చారు పోలీసులు. ఫ్రెండ్స్‌తో డ్రగ్స్‌ పార్టీ చేసుకున్నానంటూ పట్టుబడ్డ వివేకానంద అంగీకరించారు. ఖాకీ ఇంటరాగేషన్‌లో ఖతర్నాక్‌ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్భయ్‌, రఘుచరణ్‌, కేదార్‌, సందీప్‌, శ్వేత, లిశి, నీల్, క్రిష్‌లతో కలిసి వివేకానంద డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. సయ్యద్ అబ్బాస్‌ జఫ్రీ దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేశామని పోలీస్‌ విచారణలో వివేకానంద చెప్పినట్లు సమాచారం. ఇక డ్రగ్స్‌ కేసులో పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. వీరిలో వివేకానందను బీజేపీ నేత కుమారుడిగా గుర్తించారు పోలీసులు. నిందితులు కొకైన్ ని పేపర్ రోల్ లో చుట్టి సేవించినట్లు గుర్తించారు పోలీసులుపెడ్లర్‌ అబ్బాస్ స్టేట్‌మెంట్‌లో క్రిష్‌ పేరు ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పార్టీ జరిగే సమయంలో వివేకానందతోపాటు.. రాడిసన్‌ హోటల్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్లు తెలిపారు. గజ్జెల వివేక్‌ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్‌ హాజరైన పోలీసులు నిర్ధారించారు. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. డ్రగ్స్‌ పార్టీ చేసుకుంది 10మంది. దొరికింది ముగ్గురు. మిగిలిన ఏడుగురు ఎక్కడ? వేరీజ్‌ డ్రగ్స్‌ సప్లయర్‌..? ఇదే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *