సిరా న్యూస్,నల్గొండ;
నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేసారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగబద్ధమైన శాసన మండలి ఛైర్మన్ పదవీలో ఉన్నా.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. చట్టబద్ధంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. మా సంపూర్ణ సహకారం ప్రభుత్వానికి ఉందని అన్నారు.
ప్రభుత్వానికి అవసరం అయిన సలహాలు ,సూచనలు అందిస్తాం . కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సాధ్య అసాధ్యలను బేరీజు వేసుకోవాలి . ఏమి అమలు చేయగలుగుతాం , ఏమి అమలు చేయలేము అనేది సరిగ్గా ఒక అంచనాకు రావాలి . ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలి. వాస్తవం చెబితే ప్రజలు తప్పకుండా అర్ధం చేసుకొంటారు. బి ఆర్ యస్ పార్టీ అధిష్టానం కూడా ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారు అనేది విశ్లేషన చేసుకొంటుందని అన్నారు.
కేసీఆర్ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన పట్ల ప్రజలకు ప్రేమ ,విశ్వాసం అలాగే ఉన్నాయి . కేసీఆర్ రావాలి – మా ఎమ్మెల్యే పోవాలి అనే విధంగా ప్రజలు ఓట్లు వేశారు అని నా అభిప్రాయం. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే మళ్ళీ బి ఆర్ యస్ పార్టీనే అధికారంలోకి వచ్చేది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని అన్నారు.
జీహెచ్ంఎసి పరిధిలో బి ఆర్ యస్ ఎమ్మెల్యేల ,కేటీఆర్ పని తీరుకు ఓట్లు పడ్డాయి. ప్రజా సమస్యల పరిష్కారమే నా ద్యేయం . అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతంగా ఉండదు. మంత్రులు చేస్తున్న కామెంట్స్ పేపర్ లలో చూసా . విమర్శలకు ,ప్రతి విమర్శలకు ఇప్పుడు సమయం కాదు. పెండింగ్ పనులను పూర్తి చేస్తూ , పక్క కార్యచరణతో వాళ్ళు పని చేసికుంటు వెళ్ళాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషకరం . ఇద్దరు మంత్రులు కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాను. జిల్లాలో ఇరిగేషన్ పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. మంత్రి సమయం ఇస్తే త్వరలోనే రివ్యూ పెట్టాలని అడుగుతున్నా. రివ్యూలో నేను కూడా పాల్గొంటాను. జిల్లాలో రహదారుల అభివృద్ధి కి వెంకట్ రెడ్డి పని చేస్తారని నమ్మకం ఉంది. కేసీఆర్ రు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాననని అన్నారు.