సిరా న్యూస్,హుస్నాబాద్;
భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎంపి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగింది. హుస్నాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ప్రజాహిత యాత్ర ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసారు. ఇంటెలిజెన్స్ సమాచారం తో పోలీసులు అప్రమత్తమైయ్యారు. శాంతియుతంగా చేస్తున్న యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ హెచ్చరించారు. తాను ఎవరినీ కించపర్చెలా మాట్లాడలేదని స్పష్టం చేసారు. తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే కేసు పెట్టిన లీగల్ గా చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు