Noor Singh:పీఆర్‌టీయూటీఎస్‌తోనే ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

సిరాన్యూస్‌, నార్నూర్
పీఆర్‌టీయూటీఎస్‌తోనే ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం
* ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నూర్ సింగ్
* నార్నూర్ పాఠ‌శాల‌లో స‌భ్య‌త్వ న‌మోదు

పీఆర్‌టీయూటీఎస్‌తోనే ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నూర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండ‌లంలోన టీఎస్ మోడ‌ల్ స్కూల్‌, జ‌డ్పీహెచ్ ఎస్ ఉర్దూ మీడియా, జ‌డ్పీహెచ్ ఎస్ తెలుగు మీడియా, కేజీబీవీ, ఎంపీపీఎస్ పాఠ‌శాల‌లో శ‌నివారం పీఆర్‌టీయూ తెలంగాణ మోడ‌ల్ స్కూల్స్‌ రాష్ట్ర ప్రతినిధి రాజు జాదవ్ ఆధ్వ‌ర్యంలో పీఆర్‌టీయూ టీఎస్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా అన్నీ కేడర్ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు ఎజెండాగా, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార దిశగా ముందుకు కదులుతున్నారు. ప్రతి ఉపాద్యాయుడు హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వానికి బలపరుస్తు సభ్యత్వం తీసు కోవడం జరిగింద‌న్నారు.ఆగిపోయిన బదిలీ లూ, పదోన్నతులు, అన్నీ రకలా సమస్యలు అతి త్వరలో పరిస్కారం అవుతాయని తేలిపారు. కార్యక్రమంలో నాయకులు అనిత‌, దిగంబ‌ర్‌, వినోద్‌, ల‌క్ష్మ‌ణ్‌, చంద్ర‌కాంత్‌, ఉపాధ్యాయ బృంధం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *