జగన్ పర్యటనతో ఒరిగిందేమీ లేదు

సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడకు జగన్ వచ్చి వెళ్లటం తప్ప ఒరిగింది ఏమి లేదని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కార్పొరేషన్ నిధులు 2 కోట్లు వృధా అయింది. పెన్షనర్లను మోసం చేశారు. కాకినాడ కోసం ఎం చేశారో, ఎం చేయాలో చెప్పకుండా జగన్ వెళ్లిపోయారు. ద్వారంపూడి ప్రజలలో తిరుగుతున్నారు, ప్రజలలో మీ పార్టీకి ఎలా ఉందొ జగన్ కు చెప్పండి. తిరుపతి దర్శనం కోసం టికెట్ లు అముకున్న వ్యక్తిత్వం నీది. బహిరంగ చర్చకు రెండు సార్లు సవాల్ విసిరితే రాలేదు. కాకినాడకు స్మార్ట్ సిటీ తీసుకొచింది మేము. నాపై చేసిన ఆరోపనులు ద్వారంపూడి నిరూపించాలి. దుమ్ములపేట ప్రజలు నీకు సాయం చేస్తే వారికి ద్రోహం చేసావని అన్నారు.
ద్వారంపూడి వలన కలెక్టర్ మీద అధికారుల మీద కేసులు నమోదయ్యాయి. నీ వలన రిజిస్టర్ సస్పెండ్ అయ్యాడు.219 కోట్లు ద్వారంపూడి కోట్టేసాడు. నేను చేసిన పనులకు నువ్వు ఓపెన్ చేస్తున్నావ్ సిగ్గు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక రూపాయి తీసుకురాలేదు. కాకినాడ నగరానికి 2 ప్రాజెక్ట్ లు తెచ్చావ్ అంతే. మెయిన్ రోడ్డులో బ్రాందీ షాప్ వలన ప్రజలు ఇబ్బంది పడితే నేను తియిoచానని అన్నారు.
బ్రాందీ షాప్, స్పా సెంటర్ లు, ఓపెన్ చేసావ్.
ద్వారంపూడికి తెలియదేమో గాంధీ, మోడీ, సచిన్, రతన్ టాటా, మదర్ తెరిషా లాంటి వారు ఎడమ చేతి వాటం వాలే తెలుసుకోవాలి. సినిమా హాల్ లో బ్లాక్ టికెట్ అమ్ముకున్నవాడివి కష్టం విలువ నీకు తెలియదు. అందరిని తిడితే పాపులరిటీ పెరుగుతుందేమో, ద్వారంపూడి శ్రీ రెడ్డితో సమానం. కాకినాడను కంటికి రెప్పలా కాపాడుకున్నాను నేను. కొండబాబు కోసం పని చేసిన వాళ్లపై దౌర్జన్యాలు చేసావ్, కొండబాబు దగ్గర ఉన్న కార్యకర్తలు బయపడేవారు కాదు. రింగు రోడ్డు కోసం 116 కోట్లతో శంకుస్థాపన చేస్తే కావాలనే ద్వారంపూడి ఆపేసారు. ద్వారంపూడిది పదవి వ్యామోహం తప్ప ఏమి లేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *