సిరాన్యూస్, ఓదెల
బీరన్న గుడికి విగ్రహాన్ని అందించిన దంపతులు రఘుపతి- సునీత
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో బీరన్న గుడి నిర్మాణం లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు ప్రచార మాధ్యమాల్లో చూసి స్పందించి దాత ముందుకు వచ్చారు. తనది గూడెం గ్రామం కాకపోయినా… గ్రామానికి తనకు ఏ సంభందం లేకపోయినా… గూడెం మాజీ సర్పంచ్, ఇతర కురుమ కులస్తులు గుడి కోసం శ్రమిస్తున్న ప్రతి పని తను చూస్తూ నేను కూడా నా వంతు సహాయం చేస్తా అని సహృదయంతో ముందుకు వచ్చారు. వరంగల్ జిల్లా నిరుకుల్ల మండలం గీసుకొండ గ్రామానికి చెందిన కొక్కరకొండ రఘుపతి – సునీత దంపతులు ఉద్యోగ రీత్యా అమెరికా లో స్థిరపడ్డారు. వారు నూతన గుడిలో అక్క మాంకాళి విగ్రహం కొనిస్త అని తెలిపారు. సుమారుగా 30,116 రూపాయలు గూడెం కురుమ కులస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గోవిందుల ఎల్లస్వామి మాట్లాడుతూ విగ్రహ దాతకు అయ్యల బీరయ్య అక్క మాంకాళి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. గూడెం కురుమ సంఘం తరపున దాత కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.