పత్తికొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు

సిరా న్యూస్,పత్తికొండ;
పత్తికొండలో టిడిపి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కెఈ శ్యాంబాబు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డు దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాలూకా అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది సురేష్ ఆధ్వర్యంలో భారీ పూలమాలను ఎన్టీఆర్ విగ్రహానికి వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం బాబు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నందమూరి తారకరామారావు ఎంతో కృషి చేశాడని కొనియాడారు పేదలకు కూడు గూడు గుడ్డ ఉండాలని రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ ఇల్లు జనతా వస్త్రాలను కల్పించిన మహానుభావుడని అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరేసేందుకు ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి కార్యక్రమం పత్తికొండ నియోజకవర్గం లో అన్ని మండల కేంద్రాలలో ఆయా మండల నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *