సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని లంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం పైన ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్వో యాకన్న జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రీయ గీతం జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ గీతం ఆలపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ శభాష్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీ తిరుపతి, శ్రీధర్, వెంకటేశ్వర్లు, ప్రసాదు, సతీష్, పొట్క పల్లి ఏఎస్ ఐ సుధాకర్, ఈజీఎస్ సిబ్బంది ఈసీ శ్వేత, జనార్ధన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజేందర్, నరసింగం, అనిల్, విద్యాసాగర్, వెలుగు ఆఫీస్ సిబ్బంది శ్రీనివాస్, స్థానిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏఎన్ఎంలు తదితరులు ఉన్నారు.