సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తారకరామా కాలనీలో విద్యార్థులను తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎస్ఎంసీ చైర్మన్ డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బండి శోభారాణి, ఎండి జాన్, రాములు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.