సిరాన్యూస్, ఓదెల
ఓదెల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జడ్పీహెచ్ఎస్ ఓదెల పాఠశాలలో వి పద్మ ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ యోగాసనాల ద్వారా డయాబెటిస్, గుండె జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతల నుండి విముక్తి పొందవచ్చు అని, ప్రాణాయామం ద్వారా ఏకాగ్రత, శ్వాసక్రియ పై పట్టు సాధించవచ్చు అని తెలియజేశారు. అనంతరం కే రాజేందర్ పీడీ విద్యార్థులు, ఉపాధ్యాయులచే సూర్య నమస్కారములు, ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎంసి చైర్మన్ డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు సీఆర్పీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.