సిరాన్యూస్, ఓదెల
సాదాసీదాగా ఓదెల మండల సర్వసభ్య సమావేశం
ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం సాదాసీదాగా నిర్వహించారు. ఈసందర్భంగా కొలనురు ఎంపీటీసీ కారంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న బస్సు డిపో ఏర్పాటు చేయా లేకపోవడం చేతగానితనానికి నిదర్శనం అని ఆయన ఆరోపించారు. అలాగే కొలనూరు వడ్ల కొనుగోలు కేంద్రంలో సంచికి రెండు కిలోల చొప్పున వడ్లు కటింగ్ చేశారని ఆరోపించారు. ఓదెల మండల కేంద్రంలో 10 సంవత్సరాలు ఉత్తమ ఉద్యోగిగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఎంపీడీవో సత్తయ్య ను ఎంపీపీ, వైస్ ఎంపీపీ జీల తిరుపతి , ఎంపీడీవో, ఎంపీటీసీలు పూలమాల వేసి శాలువా వెంకటేశ్వర స్వామి మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఎంపిటిసి లకు చివరి సమావేశం కావడంతో ఎంపీడీవో తిరుపతి ఎంపీపీ కూనారపు రేణుకాదేవి నీ ఎంపిటిసిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకా దేవి, ఎంపీడీవో తిరుపతి, తహసీల్దార్ యాకన్న, ఎంపీ ఓ భాస్కర్ , ఓదెల ఎంపిటిసి బోడకుంట లక్ష్మిచిన్న స్వామి, ఏ ఈ సమ్మిరెడ్డి, సూపరింటెండెంట్ ఘ నుకోట శ్రీధర్, వెంకటేశ్వర్లు , ప్రసాద్, సతీష్, డాక్టర్ శభాష్ ఖాన్, సీఆర్పీ ఓంకార్, ఎం పీటీసీలు. ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.