సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో పడకేసిన పారిశుధ్యం
* జ్వరాలతో మంచం పట్టిన గ్రామస్తులు
* పట్టించుకోలేని ప్రత్యేక అధికారులు
ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరంతో మంచం పట్టారు. గ్రామంలో దోమలు స్వెర్య విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పారిశుధ్యం పడకేసింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గ్రామ ప్రజలు గత 20 రోజుల నుండి జ్వరాలతో గ్రామస్తులు మంచం పట్టారు. గొర్ల శీను వాడలోని మురికి కాలువ నీళ్లు ఎటు వెళ్లడానికి స్థితిలో ఉన్నాయి .మురుగు నీరు వలన విష జ్వరాలు స వచ్చే ప్రమాదం ఉన్నదని వైద్య అధికారులు చెబుతున్నాఅధికారులు పట్టించుకోవడం లేదు. గత 20 రోజుల నుండి గ్రామాలలో పారిశుధ్యం మారిందని స్థానికులు అంటున్నారు. సీజన్ వ్యాధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదుల సంఖ్యలో రోగులు దర్శనమిస్తున్నారు. రోగాలతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు.జ ఈ విషయంపై ఓదెల ప్రత్యేక అధికారి పారిశుద్ధంపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అంటున్నారు. గ్రామంలోని సీజనల్ వ్యాధుల ప్రబలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.