సిరాన్యూస్, ఓదెల
ఏళ్ల తరబడి అద్దె భవనంలో ఓదెల గ్రంథాలయం
* ఇరుకు గదులతో ఇబ్బందులు పడుతున్న పాఠకులు
* పట్టించుకోని అధికారులు
నిరుద్యోగ యువత, పుస్తక ప్రియులకు విజ్ఞానాన్ని అందిస్తున్న ఓదెల గ్రంథాలయం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. సొంత భవనం లేకపోవడంతో సిబ్బంది, పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శాఖ గ్రంథాలయం ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఓదెల మండల కేంద్రంలో వందమందికి పైగా నిత్యం గ్రంధాలయానికి వచ్చి పుస్తకాలు చదువుతూ ఉంటారు .ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కూడా గ్రంథాలయానికి సొంత భవనం లేక పుస్తక ప్రియులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అద్దె భవనం ఇరుగ్గా ఉండడంతో పుస్తక ప్రియులకు కూర్చోవడానికి కుర్చీల సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వత గ్రంధాలయాలు నిర్మించాలని పుస్తక ప్రియులు కోరుతున్నారు.
ఐదారుగురు మంది వస్తే నిండిపోతోంది ( నాగులమల్యాల లక్ష్మణ్ చారి, పాఠకుడు)
గ్రంథాలయంలో నిరంతరం ఏదో ఒక విషయం తెలుసుకోవచ్చు. ఖాళీ సమయంలో ఇక్కడి వస్తుంటాం. కానీ ఇక్కడ ఇరుకు గదిలో చదవడం ఇబ్బంది మారింది. పట్టుమని ఐదారుగురు వస్తే నిండిపోతుంది.
కూర్చోడానికి కుర్చీలు లేవు (తాటికొండ రామచంద్రం, పాఠకుడు)
గ్రంథాలయం అద్దె భవనంలో ఇరుగ్గా ఉండడంతో పుస్తక పాఠకులు కూర్చోవడానికి కుర్చీల లేక ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత గ్రంథాలయ భవనం నిర్మిస్తే పుస్తక పఠనం చేసే వారికి ఎంతో మేలు.