సిరాన్యూస్, ఓదెల
అన్నదానం చేసిన ఓదెల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం రామాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగవెల్లి శ్రీమన్నారాయణ, ఓదెల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవె ల్లి ఈశ్వర్. , ఓదెల గ్రామ అధ్యక్షులు నూతి సత్య నారాయణ, ఉపాధ్యక్షులు నాగుల మల్యాల రమేష్ చారి, నాగవెల్లి సంతోష్, కోశాధికారి నాగల మల్యాల లక్ష్మణాచారి , ప్రధాన కార్యదర్శి నూతి ప్రతాప్, గౌరవ సభ్యులు నాగుల మల్యాల శ్రీనివాస్ చారి, నూతి శంకర్, బ్రా హ్మండ్ల పల్లి భీమయ్య, రమణాచారి, పోలోజు రమేష్, శ్రీరాముల శ్రీనివాస్( శ్రీ శ్రీ), నూతి శ్రీనివాస్, దశరథం, తాటికొండ శంకరయ్య, మూతి రాజేందర్, నూతి సత్యం తదితరులు పాల్గొన్నారు.