ప్రాణాంతక ఇంజక్షన్లు తయారయినట్లు గుర్తింపు
మేడ్చల్;
చర్ల పల్లి లోని ఇండియన్ జినామిక్స్ కంపనీ పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జరిపారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయోటిక్ ఇంజక్షన్లు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఇంజక్షన్ల ద్వారా డిఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు నిర్దారించారు. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంది. కిమోతెరఫీలో ఇంజక్షన్లు వాడుతున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా ఇంజక్షన్లు తయారు చేస్తున్నారు. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులకు వచ్చిన సమాచారంతో దాడులు చేసారు. ఇంజక్షన్లు వాడడం వల్ల మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.