సిరా న్యూస్,పలమనేరు;
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గంలో బేలుపల్లి పంచాయతీ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పర్యటించారు. అయనను అధికారులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించేలా ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. నిన్నటి దినమే వాహనాల అనుమతి కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నామని ఆయనతెలిపినా అనుమతులు రాకపోవడంతో ప్రచార వాహనాలు లేకుండా పర్యటన చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కార్యక్రమాన్ని ఆపేయాలని అధికారులకు సూచించారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు..