టీడీపీ కి అనుకూలంగా అధికారులున్నారు

సిరా న్యూస్,ఒంగోలు;
బుధవారం రాత్రి ఒంగోలు సమతా నగర్ లో చోటు చేసుకున్న టీడీపీ వైసీపీ ఘర్షణ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకు చెందిన పలువురు కార్యకర్తలతో పాటు టీడీపీకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం పై మాజీ మంత్రి బాలినేని శ్రీనవాసరెడ్డి పిఎస్ కు వెళ్లి పోలీసులను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్ధి దామచర్లపై ఫైర్ అయ్యారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ కూడా టీడీపీకు అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించిన ఆయన టీడీపీ నాయకులు ఎస్పీ ఆఫీసు ఎదుట నిర్వహించిన ఆందోళన పై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *