జలపాతాల సందర్శనను మూసివేసిన అధికారులు

సిరా న్యూస్,అదిలాబాద్;
తెలంగాణ నయాగరాగా పేరొందిన కుంటాల, పొచ్చేర జలపాతాలను అధికారులు మూసివేసారు. అదిలాబాద్ జిల్లా మరియు ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద నీరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందు జాగ్రత్తగా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతం , బోథ్ మండలంలోని పొచ్చేర జలపాతాన్ని ఈ రోజు నుండి మూడు రోజుల పాటు సందర్శకులకు అనుమతి లేదని అధికారులు తెలిపార సందర్శకులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పై అధికారుల ఆదేశాల మేరకు పొచ్చేర జలపాతం సందర్శన ముసివేస్తున్నమని అటవి క్షేత్ర అధికారి తెలిపారు…పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లకుండా ముఖద్వారం వద్ద అటవీశాఖ అధికారులు రోడ్డు ను మూసివేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *