చిగురుమామిడి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో 1997-98 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పదో తరగతి తరువాత చాలా మంది ఎక్కడో స్థిరపడిపోయారు బతుకు దెరువు కోసం పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈనేపథ్యంలో వారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను పూజించి ఆప్యాయంగా మాట్లాడారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.