వాగునీరు తాగి వృద్ధురాలు మృతి

 సిరా న్యూస్,ఏలూరు;
కుక్కునూరు మండలంలోని వలసగిరిజనుల గ్రామమైన కురుమలతోగు అనే గ్రామంలో వాగునీరు కలిసిన బావి నీరు తాగిన కారం బొజ్జమ్మ(65) అనే వృద్ధురాలు మృతిచెందగా, మంగయ్య, లక్ష్మి,ఎర్రమ్మ లతోపాటు శాంతి,సంజన అనే ఆరునెలల చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. మొన్న కురిసిన వర్షాలకు అటవీప్రాంతం నుంచి వరదనీరు వాగుద్వారా ఆ గిరిజనులు నిత్యం ఉపయోగించే తాగునీటి బావిలో కలిశాయి. ఆ కలుషితమైన నీటిని తాగిన వృద్ధురాలు చనిపోగా, పెద్దవారి తోపాటు ,పాలు తాగే చిన్నపిల్లలుకూడా డయేరియా బారిన పడ్డారు. ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, మండలాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *