టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తాం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
సిరా న్యూస్,విజయవాడ;
అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోగా నిరసలు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్ రెడ్డి అధికారమదానికి నిదర్శనమ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరోపించారు. ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతమిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదు? పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతం పెంచకపోగా ఆదాయ పరిమితి అస్త్రంతో అంగన్వాడీలకు సంక్షేమంలో కోత పెట్టావ్. నువ్వు జీతాలు పెంచక, సంక్షేమం అందించక అంగన్వాడీలు ఎలా బతకాలి జగన్ రెడ్డీ? ఇదేనా రాజన్న పాలనంటే? చంద్రబాబు గారు రూ. 4,200గా ఉన్న అంగన్వాడీల జీతాన్ని రూ. 10,500 పెంచితే జగన్ రెడ్డి వారిని మోసం చేశాడు. అంగన్వాడీలపై జగన్ రెడ్డి కక్ష కట్టాడు. వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుతో లాఠీ చార్జ్ చేయిస్తున్నారు. ప్రశ్నిస్తే మెమో ఇచ్చి బెదిరిస్తున్నారు. రాష్ట్రమేమైనా నీ తాత జాగీరా జగన్ రెడ్డీ ? నీకు అంగన్వాడీలు శాశ్వతంగా మెమో ఇచ్చే రోజు దగ్గర్లోని ఉంది జగన్ రెడ్డీ. అంగన్వాడీల న్యాయపోరాటానికి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేరుస్తాం. సంక్షేమ పథకాలను అందిస్తామని అయన అన్నారు.