ఫిబ్రవరి 17న షర్మిల కొడుకు పెళ్లి

సిరా న్యూస్,హైదరాబాద్, 
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేశారు. తన కొడుకు వైఎస్ రాజా రెడ్డి – ప్రియా అట్లూరి వివాహం త్వరలో జరగబోతుందని వెల్లడించారు. జనవరి నెల 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహ వేడుక నిశ్చయించినట్లుగా వెల్లడించారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ఎక్స్ లో ఓ పోస్టు చేశారు.
‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజా రెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది’’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *