సిరా న్యూస్,కోనసీమ;
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద 216వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆలమూరు ఎస్సై ఎల్ శ్రీను నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన బర్రె నాగరాజు (25) ద్విచక్ర వాహనంపై రావులపాలెం వైపు నుండి మూలస్థాన అగ్రహారం వైపు వస్తు మూలస్థాన అగ్రహారం డివైడర్ వద్ద రోడ్డు దాటుచుండగా రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నాగరాజు సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు సేవిస్తున్నట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటలకు తరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు.