కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె

సిరా న్యూస్,నరసాపురం;
ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత నాలుగురోజుల గా అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేయడంతో అంగన్వాడీ కేంద్రాలు మూత పడ్డాయి. దీంతో ప్రభుత్వం కేంద్రాలు తెరిచేందుకు చర్యలు చేపట్టింది.నరసాపురం నియోజకవర్గంలో పలు అంగన్వాడీ కేంద్రాలు తాళాలును బలవంతంగా సచివాలయం సిబ్బంది, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు, వైసీపీ ప్రజాప్రతినిధులు తాళాలు పగలుగొట్టి కేంద్రాలు తెరిచారు. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఆందోళన కు దిగారు.దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *